విశాలాంధ్ర-సీతానగరం: మండల కేంద్రం సీతానగరంలో సువర్ణముఖినది ప్రక్కన ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో గురువారం జరిగిన ముడుపుల పూజలకు పెద్దఎత్తున భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలి వచ్చి భక్తిశ్రద్ధలతో పూజలునిర్వహించారు.శ్రీలక్ష్మీనరసింహస్వామిఆలయంలో తెల్లవారుజాము నుండే శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు పూజలను బ్యాచుల వారీగా నిర్వహించారు. ప్రతీగురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామీ దేవాలయంలోజరుగుతున్న ముడుపుల పూజలకు పాతభక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి కొత్త భక్తులు రాకతో అనూహ్య స్పందన వస్తుందని తోటి భక్తులు తెలిపారు.పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలనుండి భక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో పూజలు చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సులు ఉండాలని వారంతా భక్తి శ్రద్ధలతో, ఉపవాసం ఉండి పూజలు చేయడం గమనార్హం. అన్ని వర్గాలకు చెందిన భక్తజనం నిర్మలమైన మనస్సుతో పాల్గొని పూజలుచేస్తూ, ప్రదక్షిణలుచేసి పూజలను నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సుల ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. త్వరలో ప్రతీ గురువారం అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఆలయకమిటీ సన్నాహాలు చేస్తున్నారని అర్చకులు తెలిపారు.