పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ విశ్వేశ్వర్రావు
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ఈనెల 17వ తేదీన నిర్వహించే బక్రీద్ పండుగ రోజు జిల్లాలో అక్రమంగా పశు వథ, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ ఎ.విశ్వేశ్వర్రావు హెచ్చరించారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా జంతు సంక్షేమ చట్టాలను పాటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రిజర్వేషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటరీ యాక్ట్-1977 అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్ రూల్స్ 1978, 2001 ప్రకారం, జంతు సంక్షేమ చట్టాలను ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిపై జిల్లాలోని పశు సంవర్థక శాఖాధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు దృష్టి సారించాలని సూచించారు.