పాఠశాల ప్రారంభం నుండే పంపిణీ
జిల్లా విద్యా శాఖాధికారి ఎన్. ప్రేమ్ కుమార్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ ఈ నెల 13 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రారంభించిన రోజు నుండే విద్యార్ధులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. మంగళవారం నాటికీ 20 శాతం వరకు నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, బెల్ట్, షూస్ తదితర సామాగ్రి పాఠశాలలకు చేరవేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1,28,198 మంది విద్యార్ధులకు స్టూడెంట్ కిట్స్ రూపంలో యూనిఫారాలు, షూస్, సాక్స్ , బెల్ట్. స్కూల్ బాగ్, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 1 వ తరగతి విద్యార్ధులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6 వ తరగతి విద్యార్ధులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లను కూడా అందించనున్నట్లు తెలిపారు. మొత్తం కిట్లు రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో జిల్లాకు చేరనున్నాయని, ఎప్పుడు వచ్చినవి అప్పుడు వెంట వెంటనే పాఠశాలలకు తద్వారా విద్యార్ధులకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు.