***వైఎస్సార్ చేయూత నాలుగోవిడత నిధులు విడుదల సమావేశంలో ఎమ్మెల్యే జోగారావు
విశాలాంధ్ర, సీతానగరం:- మహిళలను అన్నివిధాల ఆదుకున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమపథకాలను అమలుచేసిన ఘనత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే జోగారావు తెలిపారు.గురువారం సాయంత్రం స్తానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వైఎస్సార్ చేయూత నాలుగోవిడత నిధులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మూడుసార్లు45ఏళ్లు దాటిన మహిళలకు రూ.18, 750/-రూపాయల చొప్పున జమచేసిన సీం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు నాలుగోవిడత నిధులను అందజేస్తున్నట్లు చెప్పారు.మండలంలోని కొత్తవారు 472మంది, పాతవారు 4958మంది కలిపి 5430మందికి 10.18కోట్ల రూపాయల నగదును మహిళ ఖాతాలలో జమచేయడం జరుగుతుందని తెలిపారు.రానున్న సార్వత్రికఎన్నికల్లో రాష్ట్రంలో రెండోసారి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిను సీఎంగా చేయటంతోపాటు తనకుమీఆశీస్సులను అందజేయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు.రెండోసారి ఎమ్మెల్యే జోగారావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల,గ్రామాల ప్రజా ప్రతినిదులు,నాయకులు పిలుపు నిచ్చారు.నమూనాచెక్కును మహిళ సంఘాలనేతలకు,లబ్ధిదారులకు అందజేసారు.ఈకార్యక్రమంలో ఎంపిపి బలగ రవనమ్మశ్రీరాములు నాయుడు, జడ్పీటీసీ మామిడి బాబ్జి, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు, వైస్ ఎంపిపి సూర్యనారాయణ,ఎంపిడిఓ ఈశ్వరరావు, వెలుగు ఏపిఎం శ్రీరాములునాయుడు, మండల మహిళా సంఘాల అధ్యక్షులు గొడబ ప్రమీల,35గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు,నాయకులు,మహిళా సంఘాల నాయకులు, వెలుగు మహిళలు,సచివాలయంల సిబ్బంది,వాలంటీర్లు, వెలుగు సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు