బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామలింగరాజు
విశాలాంధ్ర – గణపవరం: మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు కు భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అఖిలభారత హ్యాండ్లూమ్స్ బోర్డు మాజీ డైరెక్టర్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నంద్యాల రామలింగరాజు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలిత గణపవరం మారెమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న అల్లూరు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు కొయ్యల వెంకట సుబ్బారావు, ఆధపరెడ్డి నాగ సీతయ్య, పలివెల వెంకట శ్రీనివాస్, పేరిచర్ల రామరాజు, జైపాల్, తదితరులు పాల్గొన్నారు.