Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి

       విశాలాంధ్ర - దెందులూరు:రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి  జగన్  పనిచేస్తున్నారని దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. వై.ఎస్.ఆర్. రైతు దినోత్సవం సందర్భంగా దెందులూరు మండలం గోపన్నపాలెంలో శనివారం ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దేశానికీ అన్నం పెట్టే రైతన్న సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని,రైతు భరోసా, పంటరుణాలు, వడ్డీ లేని రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడం, ఉచిత విద్యుత్, ఉచిత పంటల భీమా పధకం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.  రైతులకు అన్నివిధాలా సహాయంగా ఉండేవిధంగా గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కేంద్రాల ద్వారా రైతులకు సాగుకు సంబందించిన అన్ని సేవలు అందుతాయన్నారు.  రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాదని, ఈ ల్యాబ్ ల ద్వారా విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరిశీలించి రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img