విశాలాంధ్ర – కామవరపు కోట : నందిగం రాణి కుటుంబ సభ్యులు తమని నిండా ముంచారని వారిపై సివిల్, క్రిమినల్ కేసులను నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలనీ హర్షిత స్కూల్ బాధిత సంఘం నాయకులు అద్దంకి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. హర్షిత స్కూల్ అభివృద్ధి పేరుతో నందిగం రాణి తమ స్కూల్లో భాగస్వామ్యని కల్పిస్తానని పలువురి వద్ద నుండి సుమారు రూ.30 కోట్ల వసూలు చేసి తప్పుకు తిరుగుతున్న విషయంపై స్థానిక హర్షిత స్కూలు వద్ద శాంతియుత నిరసన దీక్ష కార్యక్రమాన్ని శనివారం బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడి గ్రామంలో విద్యా రంగంలో పేరుగాంచిన హర్షిత స్కూల్ యాజమాన్య మైన నందిగం రాణి వారి కుటుంబ సభ్యులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న హాస్టల్, కాలేజీ ల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారన్నారు. వాటి అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి వాటి నుంచి వచ్చే ఆదాయంలో వాటాలను కల్పించడమే కాకుండా హర్షిత స్కూల్, కాలేజ్ లలో వారి అర్హతను బట్టి డైరెక్టర్లు, టీచర్స, లేచిలర్లుగా నియమిస్తామన్నారన్నారు. వారిని నమ్మిన సుమారు 83 మంది వద్ద నుండి రూ.30
కోట్లు వసూలు చేసి ప్రస్తుతం తప్పుకు తిరుగుతున్నరన్నారు. స్కూల్ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టిన వారు ఆ ప్రస్తావనను తీసుకొని వస్తే చాలు పోలీస్ కేసులు బనాయా ఇస్తానని బెదిరింపు చర్యలకు దిగుతున్నారన్నారు. నందిగం రాణి తనకు వున్న రాజకీయ పలుకుబడిని వినియోగించుకొని స్కూల్ అభివ్రుది సహకరించిన వారికి దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. స్కూల్ అభివ్రుకి ఆన్ లైన్ ద్వారా చెల్లించిన వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. అనంతరం బహుజన సేన రాష్ట్ర అధికార ప్రతినిధి మత్తే బాబీ మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధి పేరుతో నందిగం రాణి వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. బాధితుల డబ్బు తిరిగి చెల్లించకుండా వారిపై అక్రమ కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు పలుపడడం సమంజసం కాదన్నారు. స్కూల్, కాలేజీ, హాస్టల్ లలో డైరెక్టర్లుగా, ఉద్యోగులుగా నియమిస్తామని నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూళ్లు చేసిన నందిగం రాణి వారి కుటుంబ సభ్యుల పైన జిల్లా ఎస్ పి కి బహుజన సేన తరపున మెమొరాండం అందిస్తామన్నారు. మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు బెజ్జం చిరంజీవి, రాష్ట్ర మహిళా కార్యదర్శి పొట్ల విజయకుమారి , రాష్ట్ర మీడియా కన్వీనర్ అచ్యుత్ సూర్యప్రకాశ్ , జిల్లా కార్యదర్శి బలే సుబ్బారావు, వేల్పుల సుందరం, పిట్టా రాహుల్, బాధితులు నరేంద్ర రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, లక్ష్మణ్, చంద్రశేఖర్, ప్రతాప్, పలు దళిత ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.