విశాలాంధ్ర-ఉండి: ఉండి లయిన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు క్లబ్ అధ్యక్ష కారదర్సులు గొట్టుముక్కల రాము, కలిదిండి సీతారామరాజు తెలియజేశారు. ఉండి లయిన్స్ క్లబ్ ఆడిటరియం లో బుధవారం సాయంత్రం క్లబ్ సమావేశం రాము అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కార్యావర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారని ఆయన తెలిపారు. కొత్త కార్యవర్గం వచ్చే నెల జులై మొదటి తేదీ నుంచి పదవీ బాధ్యతలు చేపడుతుందని తెలిపారు. అధ్యక్షులుగా లయన్ వేగేశ్న అనంత లక్ష్మి , కార్యదర్శిగా కన్నెగంటి రూత్ కళ కోశాధికారిగా సాగిరాజు సూర్య కుమారి, ఉపాధక్షులు సత్తి బ్రహ్మరెడ్డి, గాదిరాజు రంగరాజు, ఎల్ సి ఐ ఫ్ కో ఆర్డినేటర్ గా సాగిరాజు సాంబ శివ రాజు, సర్వీస్ చైర్ పెర్సన్ ద్వారం పూడి నారాయణ రెడ్డి, మెంబర్ షిఫ్ చైర్మన్ కూనపరాజు రామరాజు, పరిపాలన ఛైర్మెన్ రుద్రరాజు నరసరాజు, మార్కెటింగ్ ఛైర్మెన్ ముదునూరి శివరామరాజు ఎన్నికైయారని చెప్పారు. తమకు అన్ని విధాల సహకరించిన సభ్యులకు, పత్రికా ప్రతినిధులకు రాము, సీతారామ రాజు లు ధన్యవాదములు తెలియ జేశారు.