ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు, జనసేన పార్టీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు
విశాలాంధ్ర – గణపవరం: సార్వత్రిక ఎన్నికల పురస్కరించుకుని సోమవారం జరిగిన ఎన్నికల్లో భాగంగా ఉంగుటూరు నియోజవర్గం నుండి ఎన్నికల బరిలో ఉన్న వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) తన కుటుంబ సభ్యులతో కలిసి నిడమర్రు మండలం బువ్వనపల్లి గ్రామంలో ఆయన ఓటు హక్కును ఆయన సతీమణి పిల్లలు వినియోగించుకున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న జనసేన పార్టీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఆయన సతీమణి ఓటు హక్కును వినియోగించుకున్నారు.