విశాలాంధ్ర – కొయ్యలగూడెం : చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్రను కొయ్యలగూడెం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దనుండి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రారంభించారు. కొయ్యలగూడెం లో ప్రారంభమైన యాత్ర బయ్యనగూడెం, సీతంపేట, నరసన్న పాలెం, గ్రామాల మీదుగా నరసన్నపాలెం గ్రామ శివారు కరాటం వై జంక్షన్ వద్ద ఉన్న దండమూడి కళ్యాణమండపం వరకు ర్యాలీగా కొనసాగింది. దండమూడి కళ్యాణ మండపం వద్ద టిడిపి పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంతో అవసరమని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే టిడిపి అధికారంలోకి రావాలని అన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలన్నారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైయస్సార్ ప్రభుత్వం పోలవరం నిర్వాసిత ప్రాంతాల ప్రజలను మోసం చేసిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు సకాలంలో నీరు అందించాలని తెలిపారు. ప్రాజెక్ట్ పై ఎటువంటి అవగాహన లేని మంత్రులను, జల వనరుల శాఖ మంత్రులుగా నియమించి ప్రాజెక్టు పనులు పూర్తిగా కాకుండా నిలిపి వేశారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరల కొనసాగాలన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ నదులు అనుసంధానం జరగాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలన్నారు. రాష్ట్రం లో రైతుల పొలాలకు , బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించిన ఘనత జగన్ దే అన్నారు. ఉత్తరంద్ర, రాయలసీమ, ప్రాంతాలలో పంటలు సమృద్ధిగా పండాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నారు.చంద్రబాబు ప్రవేశ పెట్టిన మేనిపేస్టో లో ఉన్న అన్ని పధకాలను ప్రజలకు అందచేస్తాం అని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన
బొరగం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా వైఫల్యం చెందాడని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధాన ద్యేయమని అన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతు రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషించిoదని అన్నారు. అబద్ధాల ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో మంత్రులు కూడా విపరీతంగా బూతులు మాట్లాడటం, ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై పోలీస్ లను అడ్డు పెట్టుకుని కెసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వఅధికారులను రోడ్డెక్కిచిన పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి దె అన్నారు. చంద్రబాబు అదేశాల మేరకు బస్సు యాత్ర జరుపటం జరుగుతుందని తెలిపారు. టిడిపి గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జరిగే కురుక్షేత్రం యుద్ధాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ బస్సు యాత్ర ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.పేదలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి రావాలని పేర్కొన్నారు.ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో కి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ యమ్ యల్ సి అంగర రామ్మోహన్ రావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి,మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి,పోలవరం మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పారెపల్లి రామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటి సభ్యురాలు గంగిరెడ్ల మేఘాల దేవి,నియోజకవర్గం పరిశీలకులు కోళ్ల నాగేశ్వరావు,పోలవరం మండలం మాజీ జడ్పిటిసి కుంజా శుభాషిణి, కొయ్యలగూడెం మండలఅధ్యక్షులు పారెపల్లి నరేష్, కొయ్యలగూడెం పట్టణ అధ్యక్షులు జేష్ఠ రామకృష్ణ,పరిమి రాంబాబు, శీలం వెంకటేశ్వరావు,ఆకుమర్తి రామారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.