విశాలాంధ్ర-సీతానగరం: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుదవారంనాడు 35గ్రామపంచాయతీల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కొనేర్లువద్ద, పనులు వద్ద వేతనదారులతో యోగాకార్యక్రమాలను నిర్వహించామని ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్, ఏపిఓ భానులు తెలిపారు. జిల్లా అధికారుల అదేశాలు సూచనలు సలహాల మేరకు నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఆవశ్యకతను వివరించారు. మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా యోగా పనిచేస్తుందని తెలిపారు. అప్పయ్యపేట గ్రామంలో కోనేరువద్ద జరిగిన యోగా కార్యక్రమంలో సర్పంచ్ తేరేజమ్మ, ఎంపిటిసి బురిడి కుసుమ కుమారి సూర్యనారాయణ, వేతన దారులు, ఫీల్డ్ అసిస్టెంట్ అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.