విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : యోగాతో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నది బి నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ సి సి అధికారి నన్నెబోయిన వెంకటప్పయ్య అన్నారు.34 ఆంధ్రా బెటాలియన్ ఎన్.సి.సి కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అజయ్ కౌటిన్హో ఆదేశాల మేరకు కూనం రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 367 ట్రూప్ ఎన్ సి సి అధికారి నన్నెబోయిన వెంకటప్పయ్య ఆధ్వర్యంలో ఎన్.సి.సి క్యాడెట్ లచే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్.సి.సి అధికారి వెంకటప్పయ్య మాట్లాడుతూ యోగ సాధనతో మానసికబలం, అంతులేని ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత చేకూరుతుందన్నారు .ఎన్.సి.సి క్యాడేట్స యోగాను అభ్యసించడం వల్ల వ్యసనాలకు బానిసలు కాకుండా మానసికంగా పరిపూర్ణత చెందుతారన్నారు. విద్య ఆరోగ్యం, వృత్తిపై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకోవడానికి యోగా అవసరమన్నారు.ఎన్.సి.సి క్యాండెట్స్ తమ పరిధిలోని వ్యక్తులకు యోగా ప్రాముఖ్యతను గూర్చి తెలియపరచి వారి శారీరక, మానసిక మార్పునకు తోడ్పాటును అందించాలని తెలిపారు. యోగాను ఎన్.సి.సి శిక్షణలో ఒక ప్రత్యేక పాఠాంశ్యంగా పొందుపరిచారని వివరించారు.