ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో ఈనెల 29వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు జరిగే ఎనిమిదవ ఏపీ రాష్ట్ర జూనియర్ ఇంటర్ జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు కిరణ్మయి శర్మ తరుణ్ ఎంపిక కావడం జరిగిందని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సెట్టిపీ జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు ఈ క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన ఈ క్రీడాకారులు ఈనెల 18వ తేదీన అనంతపురం జిల్లాలో ఇండోర్ స్టేడియంలో జరిగిన టోర్నమెంట్ లో వారు మంచి ప్రతిభను ఘనపరిచి, ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ బాస్కెట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సెట్టీపి జయ చంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదాయత్తుళ్ల,కోచ్ సంజయ్, తదితర సీనియర్ క్రీడాకారులు అభినందన శుభాకాంక్షలుతో,హర్షం వ్యక్తం చేశారు.