విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు వారి సహాయకులకు ఆరోగ్య కార్యకర్తలకు, ఇతర అనారోగ్య కారణము చేత వచ్చేటువంటి వారందరికీ నారాయణ సేవలో భాగంగా శుక్రవారం 150 మందికి, కేశ్రీ బాతు, వెజిటబుల్ పలావు, అన్నము, పప్పు, రసము పెరుగన్నం, వాటర్ పాకెట్లను ఇవ్వడం జరిగినదనీ. ఈ కార్యక్రమమునకు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఎక్స్రే డిపార్ట్మెంట్లో పనిచేయుచున్న వెంకటేశులు భార్య పద్మావతమ్మ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా సహకరించరని వీరికి వివాహ శుభాకాంక్షలు తో పాటు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దాతల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని సత్యసాయి తాలూకా సేవా సమితి అధ్యక్షుడు శంకర్ తెలిపారు