విశాలాంధ్ర -వలేటివారిపాలెం : జగనన్న సురక్ష కార్యక్రమం మండలంలోని పోకూరు,శాఖవరం,కూనిపాలెం, కొండసముద్రం తదితర గ్రామ సచివాలయపరిధిలో జగనన్న సురక్ష అవగాహన సదస్సు కార్యక్రమంఆయా గ్రామ సర్పంచ్ లు మరియు ఎం.ఎల్. ఓ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో వలంటీర్లు,గృహసారధులు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జేసీఎస్ మండలకన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు మరియువైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు హాజరై మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా మొదటి అడుగు గ్రామ వలంటీర్ల వ్యవస్థ తొలి అడుగు గ్రామ సచివాలయంలో స్థాపన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపుగా 35 సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకముల ద్వారా 98 శాతం లబ్ధిదారులకు న్యాయం జరిగిందని తెలిపారు. ఇక మిగిలిన రెండు శాతం అర్హులైన లబ్ధిదారులకు ఏ ధ్రువీకరణ పత్రములు లేకుండా, సంక్షేమ పథకాలు పొందలేని వారికి, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నేరుగా ప్రతి ఇంటింటికి సందర్శించి, వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రములు పొందుటకు తగు సహాయం చేస్తారని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయబడుతుందని తెలిపారు. అందులో కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, జనన ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ, వివాహ ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ, సవరణలు కొరకు మ్యుటేషన్, ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం కొత్త ఆధార్ కార్డు చేయించుట, 5-17 సంవత్సరముల వారికి డెమోగ్రఫి అప్డేట్ చేయుట, కౌలురైతు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు నుండి కుటుంబ సభ్యులు వేరు చేయుట, హౌస్ హోల్డ్ నుండి కుటుంబ సభ్యులు వేరు చేయుట లాంటివి ఉచితంగా ఇవ్వబడుతుందని తెలిపారు. కావున ప్రతి కుటుంబము ఈ సేవలను వినియోగించుకొని నూరు శాతం లబ్ది పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్రె జగదీష్,లింగాబత్తిన మాల్యాద్రి,అత్తోట చెన్నయ్య,నవులూరి హాజరత్తయ్య,గడ్డం మాధవరావు, గడ్డం శివరామయ్య,మన్నం వెంకట రమేష్,నరసింహారావు,దామా వెంకటేశ్వర్లు,దివి వీరయ్య సచివాలయ కన్వీనర్లు, సచివాలయసిబ్బంది,వలంటీర్లు, గృహసారధులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు