విశాలాంధ్ర- వలేటివారిపాలెం : ప్రభుత్వ సంక్షేమ పలాలు ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ సేచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందలేని కుటుంబాలకు సైతం ప్రభుత్వపథకాలు అందేలా రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జెడ్పిటీసీ ఇంటూరి భారతి అన్నారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లి మరియు పోలినేనిచెరువు సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్ లు డేగా వెంకటేశ్వర్లు, చెన్నెబోయిన ఓబులుకొండయ్య యాళ్ల సుబ్బరాజ్యం, తహసీల్దార్ సుందరమ్మ, ఎంపీడీఓ రఫిక్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా జెడ్పిటీసీ ఇంటూరి భారతి, ఎంపీపీ పొనుగోటి మౌనిక హాజరైనారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
జగనన్న సురక్ష్ణ కార్యక్రమం ద్వారా ప్రజలకు 11 రకాల సేవలను ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు . ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగనుందని . జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ అధికారులు సచివాలయ పరిధిలో క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేస్తారని అన్నారు . ఈ క్రమంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలతో మాట్లాడి వారికి అసవరమైన సేవలకు సంబంధించిన అభ్యర్థనను రిజిస్టర్ చేస్తారని అన్నారు క్యాంపు నిర్వహించే రోజున సరైన ధ్రువీకరణ పత్రాలతో హాజరయ్యేలా చైతన్య పరుస్తున్నారని, క్యాంపులోనూ సమస్యలపై అభ్యర్థనలు, ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. సేవలకు అందజేయాల్సిన డాక్యుమెంట్లు గురించి కూడా క్లుప్తంగా వివరించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులకు సర్టిఫికెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలమీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి,మండల జేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు, వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు ఉపసర్పంచ్ మద్దులూరి కొండలరావు, సచివాలయకన్వీనర్లు యాళ్ల శివకుమార్ రెడ్డి,ప్రగడ శ్రీనివాసులు ఎల్.ఐ.సీ. మాల్యాద్రి,డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ నర్సయ్య, కార్యదర్శులు అనిల్, రవికుమార్, ఏడుకొండలు,
అధికారులు,వైయస్సార్ సిపి నాయకులు,వలంటీర్లు , గృహ సారథులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు.