విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ పుట్టపర్తి రోడ్డులో గల శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో ఈనెల మూడవ నాలుగవ తేదీలలో రెండు రోజులపాటు రజతోత్సవ గురుపూర్ణిమ వేడుకలను శిరిడి సాయిబాబా సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు వేలాదిమందికి బాబా పాద దర్శనం భక్తుల కొరకు గావించారు. దాదాపు 20వేల మందికి పైగా అన్నదానం కూడా పంపిణీ చేశారు. తదుపరి చివరి రోజు మంగళవారం ఉదయం బాబాకు ప్రత్యేక పూజలతో పాటు కాగడ హారతి, అభిషేకములు అర్చకుల ద్వారా నిర్వహించారు. తదుపరి లక్ష కుసుమార్చినా కార్యక్రమాన్ని వేద పండితుల ద్వారా నిర్వహించారు. తదుపరి సాయంత్రం బ్రహ్మోత్సవా కార్యక్రమాల్లో భాగంగా బాబా వారి ఉత్సవ విగ్రహాన్ని పూలరతము పై ఆశీనులు చేసి, పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ గ్రామోత్సవంలో సెమినారాయణి స్వామి కోలాటం మహిళా బృందము, కర్ణాటక, కేరళ కళాకారులు, ప్యదిండి నరసింహులు చెక్కభజన బృందం, రామలక్ష్మణులు, గ్రామోత్సవములో ఆకర్షణగా నిలిచారు. గురు పూర్ణిమ వేడుకలు సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా సేవా సమితి వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగ చేస్తున్నారు, ఇటువంటి కార్యక్రమాల పైన పట్టణ భక్తాదులు, ప్రజలు, వేలాదిమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్, కార్యదర్శి రాంప్రసాద్, కోశాధికారి హేమంత్ కుమార్ , సభ్యులు టిసి. నారాయణరెడ్డి, సూర్యనారాయణ, రామలింగయ్య, జెసి. నాయుడు, కె. వీరనారాయణ, మంజు, లీల, శోభ, వేలాదిమంది భక్తాధులు పాల్గొన్నారు.