విశాలాంధ్ర,సీతానగరం: జిల్లాలోని అన్ని యాజమాన్యాల క్రింద ఉన్నత పాటశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి విజయనగరం జేఎన్టియులో ఈనెల 1నుండి 15వరకు ఐ ఎఫ్ పి శిక్షణతరగతులు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారులు జి. సూరిదేముడు, మువ్వల వెంకట రమణలు తెలిపారు. ఒక్కోక్క ఉపాధ్యాయునుకి రెండురోజులు పాటు శిక్షణను ఇస్తున్నట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాకు విజయనగరం జెఎన్ టియు లోను, విజయనగరం జిల్లాకు సంబంధించి రాజాం జి ఎం ఆర్ లో డిజిటల్ రూపంలో భోదనపై శిక్షణను ఇస్తున్నట్లు చెప్పారు.టీచింగ్ తరగతులు డిజిటల్ రూపంలో బోధనపై, సాంకేతిక పరిజ్ఞానం గూర్చి ఈతరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యశాఖాధికారులు తెలిపారు. త్వరలోనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులకు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.