విశాలాంధ్ర-రాప్తాడు : నాలుగేళ్ళ వైసీపీ పాలనలో సీఎం జగన్ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు మంజూరు చేశారని…ప్రస్తుతం వివిధ రకాల ధ్రువపత్రాలు జగనన్న సురక్ష కార్యక్రమం కింద ఉచితంగా అందజేస్తున్నారని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి తెలిపారు. గురువారం మండలంలోని గాండ్లపర్తి సచివాలయంలో ఎంపీడీఓ సాల్మన్ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ జయలక్ష్మి మాట్లాడుతూ.. అర్హత ఉండీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే అలాంటి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చాలని సచివాల సిబ్బందికి సూచించారు.
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా గడప వద్దకే వచ్చి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా అవసరమైన సర్టిఫికెట్లను(జనన, మరణ, కుల, ఆదాయ మొదలైన 11 రకాలు) అక్కడే అందిస్తున్నారన్నారు.
జగనన్న సురక్ష క్యాంప్ లో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి సకాలంలో ప్రజలకు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లబ్దిదారులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మీనరసింహ, వైసీపీ కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, జెడ్పీటీసీ పసుపుల హేమావతిఆది, సర్పంచ్ చంద్రకళచిన్నకృష్ణారెడ్డి, ఎంపీటీసీ రాముడు, పంచాయతీ కార్యదర్శులు రేఖాశారద, విజయ్, వీఆర్ఓలు లింగారెడ్డి, రవి, మాజీ సర్పంచ్ బాలకృష్ణారెడ్డి, డీలర్ ప్రసాదరెడ్డి, డొక్కా రామచంద్ర, రఘునాథరెడ్డి, నల్లప్ప,నాగరాజు, సూరీ, రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు తాతిరెడ్డి, విజయశంకర్ తదితరులు పాల్గొన్నారు.