సర్పంచులు
విశాలాంధ్ర -ధర్మవరం: ప్రజల సమస్యల పరిష్కారమే జగనన్న సురక్ష కార్యక్రమము యొక్క ముఖ్య లక్ష్యము అని ప్రత్యేక అధికారి చాంద్ బాషా,చింతలపల్లి సర్పంచ్ బాబయ్య ఉప్పునీసనపల్లి సర్పంచు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల పరిధిలోని చిగిచెర్ల సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం ముత్యాలప్ప నాయుడు అధ్యక్షతన జరిగింది. అనంతరం ఎంపీడీవో సౌజన్యకుమారి, సర్పంచులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 11 రకాల సర్వీసుల పై అవగాహన కల్పించి వివరించడం జరిగిందన్నారు. అనంతరం మూడు గ్రామ పంచాయతీలకు కలిపి1805 సర్వీస్ సర్టిఫికెట్లను ముఖ్య అతిథుల చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి మమతా దేవి,ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ ఓబిరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, సచివాలయ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు, వైస్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి హరీష్ తో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.