విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని రైల్వే స్టేషన్ రోడ్ రాంనగర్ లో గల శ్రీ కోదండ రామాలయ దేవాలయములో ఈనెల 16వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సిద్ధ ఆయుర్వేద యోగ ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు సేవా భారతి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తిరుమలేశు, నరేష్ బాబు, దాసరి రామన్న, రవీంద్ర దాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఆర్తో న్యూరో ఆక్యుపచర్ నిపుణులచే ఉచిత చికిత్స ద్వారా సమస్యలకు పరిష్కారం చూడబడునని తెలిపారు. వైద్యం చేయించుకునేవారు తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకొని పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ శిబిరంలో వెన్నెముక, మోకాలు, మెడ, భుజాలు కీళ్ల నొప్పులు, పక్షవాతం, లివర్, గాల్ బ్లాడర్,కిడ్నీ సమస్యలు కడుపునొప్పి, వినికిడి లోపం లాంటి రోగాలకు వైద్య చికిత్సలను అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8142354641 9291644940కు సంప్రదించవచ్చునని తెలిపారు.