విశాలాంధ్ర-గుంతకల్లు : వికే ఆదినారాయణ రెడ్డి 26వ వర్ధంతి ని స్థానిక సీపీఐ పార్టి కార్యలయంలో మంగళవారం సీపీఐ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.ఈ సభను సీపీఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షతన వహించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుల్లాయప్ప, సిపిఐ రూరల్ కార్యదర్శి రాము రాయల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే దేవేంద్ర, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి రామాంజనేయులు,ఏఐటీయూసీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వీకే ఆదినారాయణ రెడ్డి తుది శ్వాస విడిచే వరకు పాలక పార్టీల నేతల దౌర్జన్యాలను ఖండిస్తూ ప్రభుత్వాలపై ఉద్యమ పోరాటలతో ఒత్తిడి తెస్తూ ప్రజా సమస్యలపై ముందుండి పోరాడిన వ్యక్తి నిజమైన కమ్యూనిజం తో పనిచేసిన వ్యక్తి వీకే ఆదినారాయణ రెడ్డి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు
మల్లయ్య,ఉమర్ భాష, గడ్డం భాష, చితాంబరం ,శంకరప్ప, దౌలా, నందు, నరసయ్య ప్రసాదు, పుల్లయ్య, గురు స్వామి, మాధవ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.