విశాలాంధ్ర- ఆస్పరి : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నెల రోజులు పాటు కొనసాగిస్తున్న జగనన్న సురక్షతో సత్వర సేవలు అందుతాయని ప్రజలు వినియోగించుకోవాలని సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జేసిఎస్ మండల కన్వీనర్ బసవరాజు లు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోనే కైరిప్పల, హలిగేర గ్రామ సచివాలయ కేంద్రాలలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచులు కాసారం తిమ్మక్క, బోయ లింగమ్మ ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష పేదలకు వరం లాంటిదని, అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 11రకాల దృవీకరణ పత్రాలను సర్వీస్ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా పొందే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో రాణేమ్మ, ఈఓఆర్డి నరసింహారెడ్డి, సొసైటీ సీఈఓ అశోక్, వైకాపా నాయకులు నాయుడు, మాజీ డైరెక్టర్ వీరభద్రి, కుక్కల రంగన్న, ఎంపీటీసీ భర్త లక్ష్మన్న, ఉప సర్పంచ్ స్వాతి, తిమ్మప్ప, ప్రకాష్, రాజన్న గౌడ్, శివ, లక్ష్మన్న, గోవిందరాజులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటరీలు, ప్రజలు పాల్గొన్నారు.