సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా
బెంగళూరు: నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మహిళల భద్రత తదితర అనేక అపరిష్కృత సమస్యలతో దేశానికి పెద్ద ముప్పు ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఆ సమస్యలన్నింటిని తక్షణమే పరిష్కరించుకోవడం అవశ్యమని నొక్కిచెప్పారు. రాజా మంగళవారం బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విపక్షాల భేటీలో అనేక అంశాలను చర్చించినట్లు తెలిపారు. బీజేపీపై ఐక్యపోరుకు నిర్ణయించామన్నారు. సమన్వయ కమిటీల ఏర్పాటు వంటి అనేక ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు.