జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని అన్ని వార్డులలో ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లను డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే దిశగా అధికారుల దృష్టికి తీసుకొని రావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం చిలకం వారి స్వగృహంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు బూత్ లపై సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధ్యతగా అర్హులైన వారిని ఓటర్ జాబితాలోకి చేర్పించాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, సిద్ధంగా ఉండాలని వారు తెలిపారు.104 బూతులకు ఓటర్ పరిశీల సభ్యులుగా పార్టీ నాయకులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఒకరికి రెండు ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు ఇంకను తొలగించలేకపోవడం, డబుల్ ఎంట్రీ లాంటివి తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు.