ఆర్డిఓ తిప్పే నాయక్,మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 40 వార్డులలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఆర్డిఓ తిప్పే నాయక్,మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 4వ తేదీ నుండి 24వ తేదీ వరకు ప్రకటించిన షెడ్యూల్ తేదీలలో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. సచివాలయ అధికారులు, సంబంధిత మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని తెలిపారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 రకాల సర్టిఫికెట్లను ఇవ్వడం జరుగుతుందని, ఇందులో కుల, నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ, కౌలు గుర్తింపు కార్డులు, న్యూట్రిషన్ ఫర్ ట్రాన్సాక్షన్, న్యూట్రిషన్ ఫర్ కరెక్షన్, కుటుంబ వివరాల్లో సభ్యుల పేర్లు తొలగింపు, వివాహ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్, ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింకు, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన గల సర్టిఫికెట్లను ఉచితంగా ఇవ్వబడును అని తెలిపారు. గత కొన్ని రోజులుగా వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమం పైన ఇంటింటికి తిరగడం జరిగిందని వారు తెలిపారు. ఇచ్చిన షెడ్యూల్ తేదీలలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.