విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండల ఎంపీడీవో గా వరలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సత్య సాయి జిల్లా ఓబుల దేవ్ చెరువు నుంచి ఆమె ఉరవకొండకు బదిలీపై వచ్చారు. నూతన ఎంపీడీవో వరలక్ష్మిని జడ్పిటిసి సభ్యురాలు ఏసీ పార్వతమ్మ, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రి స్వామి, వైయస్సార్సీపి పార్టీ సీనియర్ నాయకులు తిరుపాల శెట్టి, ఓబన్న, తదితరులు కలిసి ఆమెకు అభినందనలు తెలియజేశారు.