నక్కల వెంకటేష్
విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా ఉమ్మడి అనంతపురంలో ఆగస్టు 12వ తేదీ శనివారం కొడికొండ చెక్పోస్ట్ విరాట్ ప్యాలెస్ నందు ఉదయం ఎనిమిది గంటలకు 122వ జాతీయ శతాధిక కవి సమ్మేళమును నిర్వహిస్తున్నట్లు నక్కల వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం మాట్లాడుతూ ఈ సమ్మేళనకు కళావేదిక జాతీయ అధ్యక్షుడు, చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, అంతర్జాతీయ సమన్వయకర్త రమావతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ యువజన నాయకుడు వడ్డీ సుధాకర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా నరేష్ను, ఉపాధ్యక్షులుగా మంజులను, ప్రధాన కార్యదర్శులుగా సాకే పోతనను, కార్యదర్శులుగా నక్కల వెంకటేష్, విద్వాన్, సుధాకర్, గిరి, కాశీ, నారాయణస్వామి, మహిళా కార్యదర్శిలుగా కృష్ణవేణి, శ్రీవిద్యలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. కావున అభిలాష ఉన్న ప్రతి కవి కళాకారులు ఈ సమ్మేళనంలో పాల్గొని, విజయవంతం చేయాలని వారు కోరారు.