విశాలాంధ్ర – కదిరి : వచ్చేనెల 7న విజయవాడలో జరగనున్న రైతుల ధర్నాలు జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, రైతు సంఘ జిల్లా కార్యదర్శి జెవీ రమణ, సహాయ కార్యదర్శి మధు తెలిపారు. శుక్రవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో రైతు దడ్ల కు సంబంధించిన గోడపత్రికల ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఎకరాకు పదివేలు సాగు సాయం రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రతి రైతుపై 2.45లక్షల రుణభారం పడిందన్నారు. పండించిన పంటకు కనీసం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం ఆటకెక్కిందన్నారు. ప్రజలందరికీ ఆహారం అందిస్తున్న రైతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు రుణభారం వ్యవసాయానికి దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రైతు కవులు రైతులందరిని ఆదుకోవాలని కోరారు.