జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
విశాలాంధ్ర-ఉరవకొండ : మొహరం పండుగను ప్రజలందరూ కూడా శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఉరవకొండ రూరల్ మరియు అర్బన్ పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసులు యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే శాంతి కమిటీలు కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్య కలిగించామని సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలను కూడా గుర్తించడం జరిగిందని అక్కడ కూడా ఏ లాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలను కాపాడడానికి ప్రత్యేక చర్యలను కూడా తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డిఎస్పి నర్సింగప్ప, రూరల్ సీఐ శేఖర్, అర్బన్ సిఐ హరినాథ్ పాల్గొన్నారు.