విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్ధులకు సీతానగరం వాసవి క్లబ్ ద్వారా నోట్ పుస్తకాలు,పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లను సరస్వతిపథకం ద్వారా బుదవారం అందజేయడం జరిగిందని వాసవీ క్లబ్ రీజనల్ చైర్ పర్సన్ మమ్ముల విశ్వేశ్వరరావు , జోన్ ఛైర్మన్ ఆరిశెట్టి సత్యనారాయణలు తెలిపారు.వాసవీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ ఎం ఇళ్లా ప్రసన్న లక్ష్మి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆరిశెట్టి గోవిందరాజు ,సెక్రెటరీ కూర్మదాసు లక్ష్మణరావు, కూర్మదాసు శ్రీనివాసరావు తదితరులతో పాటు పాటశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. వాసవీ క్లబ్ సేవలను ఉపాధ్యాయ సిబ్బంది కొనియాడారు.