సమగ్ర శిక్ష అధికారిని.. అమరావతి
విశాలాంధ్ర – ధర్మవరం : భవిత సెంటర్లో విద్యార్థులను చేర్పించాలని ఓ ఎస్ సి.. ఐఈడ్. సమగ్ర శిక్ష జెడి.అమరావతి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వారు పట్టణంలోని ఎర్రగుంటలో గల భవితా సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అక్కడి కార్యక్రమాలను వివరంగా పరిశీలించి తగు సూచనలను తెలియజేశారు. తదుపరి భవితా సెంటర్ నందు విద్యార్థులకు వారికి అందజేయబడ్డ పరికరాలను, విద్యార్థులకు అందించాల్సిన పరికరాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాఠశాలలో చేరాలని బడి బయట ఎవ్వరు కూడా ఉండకూడదని సూచించారు. భవిత సెంటర్లో విద్యార్థుల నడవడిక, ప్రవర్తనలో ఎంతో మార్పు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి ఆనంద్ బాబు, మండల విద్యాశాఖ అధికారి-1. రాజేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టి. టీచర్లు పాల్గొన్నారు.