విశాలాంధ్ర – పెద్దకడబూరు :సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం పెద్దకడబూరులోని సచివాలయం-1,2 లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు సిబ్బంది హాజరు, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వెయ్యాలన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఫీల్డ్ లకు వెళితే మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించాలని కోరారు.