ఉ.కొరియా సంకల్పం
ప్యాంగ్యాంగ్: చైనాతో సహకారాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలని సంకల్పించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. తమ దేశానికి వచ్చిన చైనా ప్రతినిధులకు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆతిథ్యమిచ్చారు. అందరితో ఆత్మీయంగా పలుకరించారు. రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచుకోవాలని అన్నారు. సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని కొరియా, చైనా ప్రతినిధులు నిర్ణయించారు. అంతర్జాతీయంగా నెలకొన్న క్లిష్ఠపరిస్థితులను కలిసి ఎదుర్కొందామన్నారు. వ్యూహాత్మక సయోధ్యను కొత్త ఉన్నత శిఖరాలకు చేర్చాలని నాయకులు సంకల్పించారు. ఈ మేరకు కొరియన్ సెంటర్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) శనివారం నివేదించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు లి హోంగ్జోంగ్ నేతృత్వ చైనా ప్రతినిధుల బృందం ఉత్తర కొరియాలో జరిగిన కొరియా యుద్ధం ముగింపు ఉత్సవాల్లో పాల్గొంది. కోవిడ్ తర్వాత విదేశీ ప్రతినిధులు ఉత్తర కొరియాలో పర్యటించడం ఇదే మొదటిసారిగా కేసీఎన్ఏ వెల్లడిరచింది. 1950`53లో జరిగిన కొరియా యుద్ధాన్ని ముగించేందుకు ఆర్మిస్టీస్ ఒప్పందంపై సంకతాలు జరిగి 70ఏళ్లు అయిన సందర్భంగా ఈనెల 27న ఉత్తర కొరియాలో ఘనంగా వేడుక నిర్వహించింది. ఈ వేడుకల్లో అతిథులుగా పాల్గొనేందుకు చైనా బృందం వచ్చింది. ఈ సందర్భంగా తమకు శుభాభినందనలు తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లేఖ పంపినందుకుగాను ఆయనకు కిమ్ కృతజ్ఞతలు తెలిపారు.