విశాలాంధ్ర -ఆస్పరి : మండల పరిధిలోని బిల్లేకల్లు గ్రామ పంచాయతీ మజరా గ్రామమైన ఐనకల్లు లో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సీపీ జెండాను సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల మెచ్చేపాలన అందిస్తున్న మెనగాడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. సచివాలయ వ్యవస్ధతో పరిపాలనను ప్రజల ఇంటి ముందు నిలిపారని, ప్రజలకు జవాబుదారీతనంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అధికారం అంటే బాధ్యత, సేవ అని చాటి చెప్పి నిరంతరం ప్రజలతో మమేకమైన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి లేదని చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఇతర పార్టీల శక్తులు 2024 ఎన్నికల్లో ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్ సిపి శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, సీనియర్ నాయకులు హనుమంతు రెడ్డి, గ్రామ నాయకులు గోవిందు, గురప్ప, గోవిందరాజులు, రంగస్వామి, శేషప్ప, బాలకృష్ణ, శివ, శేఖర్, లాలు, మహానంది, మల్లికార్జున, సుధాకర్, హరి, నాగరాజు, తిమ్మప్ప లు పాల్గొన్నారు.