బెంగళూరు: బెంగళూరు పౌరులు ఇప్పుడు తెలివైన, సురక్షితమైన, కాలుష్యం కలిగించని ప్రజా రవాణాను కలిగి ఉంటారు. టాటా మోటార్స్ స్మార్ట్ ఎలక్ట్రిక్ బస్సు నమూనాను ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రభుత్వ రవాణా మంత్రి రామలింగారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఎన్వీ ప్రసాద్, రవాణా శాఖ కార్యదర్శి జీ.సత్యవతి, మేనేజింగ్ డైరెక్టర్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)తో పాటు కర్ణాటక ప్రభుత్వం, బీఎంటీసీ, టాటా మోటార్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాటా మోటార్స్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ టీఎంఎల్ స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్, బీఎంటీసీ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా, కంపెనీ 12 సంవత్సరాల కాలానికి 921 యూనిట్ల అత్యాధునిక 12 మీటర్లలో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తుంది. టాటా స్టార్బస్ ఈవీ అనేది సుపీరియర్ డిజైన్, సుస్థిరమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి అత్యుత్తమ-క్లాస్ ఫీచర్లతో స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన బస్సు.