విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో జపాన్ ప్రతినిధుల బృందం రెండవ రోజున విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అధ్యాపకులతో ఇంటరాక్షన్ సెషన్ ను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ యుకారి షిరోటా గకుషుయిన్ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ టెట్సుజీ కుబోయామా, గకుషుయిన్ విశ్వవిద్యాలయం , ప్రొఫెసర్ టకాకో హషిమోటో, చిబా యూనివర్శిటీ ఆఫ్ కామర్స్ లు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు , ప్రోత్సాహకాల గురుంచి వివరించారు. ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్ టకాకో హషిమోటో మాట్లాడుతూ ..ఐఈఈఈ సబ్యత్వం , వాటి ప్రయోజనం గురుంచి విద్యార్థులకు వివరించారు. ఇంజనీరింగ్ రంగం లో అనేక పరిశోధనలు పొందుపరిచి ఉంటారని, ప్రతి ఒక్క విద్యార్థికి పరిశోధనలకు ఈ మెంబర్షిప్ ఎంతో ఉపయోగం అని అన్నారు. ప్రొఫెసర్ టెట్సుజీ కుబోయామా మాట్లాడుతూ.. జపాన్ లో ఉద్యోగ అవకాశాలు మెరుగుగా ఉంటాయి అని, కన్స్ట్రక్షన్, మెషిన్ పార్ట్స్ అండ్ టూల్ ఇండస్త్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, షిప్ బిల్డింగ్ అండ్ షిప్ మెషినరీ వంటి మొదలైన రంగాలలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. జపాన్ లో ఉద్యోగం చేయాలనుకునేవారికి స్పెసీఫైడ్ స్కిల్డ్ వర్కర్ కేటగిరిలో జపాన్ ప్రభుత్వం ప్రత్యేక వీసాలు ఇవ్వనుంది అని కూడా అన్నారు. 2030 నాటికి జపాన్లో 60 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని, జపనీస్ బాషా నైపుణ్యం అనేది కీలకం అని అన్నారు. కావున విద్యార్థులు వీటి పై ద్రుష్టి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, డీన్ ఇంటర్నేషనల్ సెల్ డాక్టర్ శ్రీమంత బసు, కలశాల ప్రొఫెసర్ డాక్టర్ బసాబి చక్రబర్తి, కో ఆర్డినేటర్ యూ. విజయ లక్ష్మి, బి. శ్రీకాంత్ పాల్గొన్నారు.