ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి సందర్భంగా గరుడోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అర్చకులు, దాతలు, భక్తాదుల నడుమ ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు,వైస్ చైర్మన్ కుండా చౌడయ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు కోనేరాచార్యులు, భాను ప్రకాష్ ,మకరంద బాబు, చక్రధర్లు భక్తాదుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగానే ధర్మవరం పట్టణంలో కూడా గత కొన్ని నెలలుగా ఈ గరుడోత్సవ కార్యక్రమాన్ని పౌర్ణమి రోజున నిర్వహించడం జరుగుతోందన్నారు. గరుడ సేవ సమాజ సంక్షేమం కోసమే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సాయంత్రం 6 గంటలకు దాతలు, అర్చకులు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ గరుడ ఉత్సవమును పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా నిర్వహిస్తున్నామని, గరుడ సేవ దాతలుగా బండ్లపల్లి శోభ శ్రీ,బండ్లపల్లి వెంకట జయ ప్రకాష్ లు.. ధర్మవరం వారు వ్యవహరించరని తెలిపారు. అనంతరం దాతల పేరు రిటన ప్రత్యేక పూజలు నిర్వహించి, వారిని స్వామి వారి సమక్షంలో ఘనంగా అర్చకులు, ఆలయ చైర్మన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక సభ్యులతో పాటు అన్నమయ్య సేవా మండలి పోరాల్ల పుల్లయ్య, పోరాల్ల పద్మావతి, వారి శిష్య బృందం, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.