విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 15వ వార్డు శివరామి రెడ్డి కాలనీలో నీరు సరఫరా అయ్యే ట్యాంకు కు సంబంధించి ఐరన్ పైపులు కట్టవడంతో ఆ ప్రాంత వాసులు నీటీ సమస్యతో ఇబ్బందులకు గురయ్యారు. సమస్యను వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున కు కాలనీ వాసులు తెలపడంతో ఆయన వెంటనే గ్రామ సర్పంచ్ లలిత, కార్యదర్శి గౌస్ సాహెబ్ దృష్టికి తీసుకెళ్లి కొత్త పైపులు మరియు విద్యుత్ సామగ్రిని దగ్గరుండి ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించారు. సమస్యను పరిష్కరించేందుకు కృషిచేసిన వార్డు సభ్యులకు మరియు సర్పంచు కార్యదర్శులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.