విశాలాంధ్ర – ఏలూరు : స్థానిక శాంతినగర్ శ్రీచైతన్య విద్యార్థులు నాసా ప్రాజెక్ట్ రూపకల్పనలో జాతీయస్థాయిలో ప్రథమ విజేతలుగా నిలిచి తమ సత్తా చాటారని, వరుస విజయాలతో జాతీయ, అంతర్జాతీయ ఆవిష్కరణలలో తమ విద్యార్థులు ప్రముఖ పాత్ర అనేక సంవత్సరాలుగా ఉన్నదని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.శివ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక అభినందన సభలో ముఖ్యఅతిథి, శ్రీచైతన్య విద్యాసంస్థల రీజినల్ (ఏలూరు- పాలకొల్లు) ఇంచార్జ్ సుంకర పార్థసారథి మాట్లాడుతూ ప్రపంచం సాంకేతిక రంగం వైపు పరుగులు తీస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ సాంకేతికత పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
విశిష్ట అతిధి, జోనల్ ఎకడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్. ఉదయభాస్కర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఎన్నో నూతన ఆవిష్కరణలను ప్రపంచానికి అందించిన అనేక శాస్త్రవేత్తలను గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇతర గ్రహాల పైనా మానవ నివాసాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం అన్నారు.అనంతరం వారి చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పతకాలను బహూకరించారు.సభలో జోనల్ ఎకడమిక్ డీన్ జాల సంజీవ్ కుమార్, నాసా ఇంచార్జ్ కుమారి దేవి,అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.