ముంబయి: దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఉత్తరప్రదేశ్లోని రaూన్సీలో 1000వ బ్రాంచ్ను ప్రారంభించడం ద్వారా ఈ మైలురాయిని సాధించిన దేశంలోని ఏకైక ప్రైవేట్ రంగ బీమా సంస్థగా అవతరించింది. ఎస్బీఐ లైఫ్ 1000వ శాఖ లాంఛనప్రాయ ప్రారంభోత్సవంతో దేశంలో అత్యంత అందుబాటులో ఉండే బీమా ప్రొవైడర్లలో ఒకటిగా సంస్థను నిలిచింది. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే దేశం పెద్ద లక్ష్యం పట్ల కంపెనీ నిబద్ధతను సైతం ఈ బ్రాంచ్ విస్తరణ వెల్లడిస్తుంది. ఎస్బీఐ లైఫ్ 1000వ శాఖ కార్యాలయం రaూన్సీ ఫూల్పూర్, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో ఉంది, దీనిని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి, సీఈఓ మహేశ్ కుమార్ శర్మ ప్రారంభించారు.