విశాలాంధ్ర -ధర్మవరం : పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషిచేసి మెరుగైన మానవ జీవనం కోసం కృషి చేసిన వారికి ఇటీవల హిందూపురంలో జిల్లా రచయితల సంఘం, ముస్లిం నగర జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో పర్యావరణ మిత్ర స్ఫూర్తి పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి గాను ధర్మవరం పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందుగల విశ్వ భారతి స్కూల్ అధినేత రిజ్వాన్ భాషాకు ఈ పర్యావరణ మిత్ర స్ఫూర్తి పురస్కార అవార్డు లభించింది. అనంతరం రిజ్వాన్ భాషా మాట్లాడుతూ తనతో పాటు ఎన్నో విద్యాసంస్థలు ఎన్నో సంవత్సరాలుగా నిర్విరామ కృషిని చేస్తున్నాయని, వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచిందని వారు తెలిపారు.