విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామ శివారులోని నబిసాబ్ దర్గా వద్ద అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని సమాచారంతో పోలీసు సిబ్బందితో దాడి చేసి నలుగురని అరెస్టు చేసినట్లు సిఐ ఎరిషావలి, ఎస్ఐ మహేష్ కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు నాగలాపురం గ్రామానికి చెందిన బోయ ఈరన్న, బోయ ఆంజనేయ, కల్లుకుంట గ్రామానికి చెందిన దుర్గప్ప, బోయ యువరాజులపై దాడి చేసి వారి వద్దనుండి 786 టెట్రా 90 ఎంఎల్ ప్యాకెట్స్ 8 బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే రవాణాకు వినియోగించిన మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు.