డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఖాళీగా ఉన్న దుకాణములపై,టెండర్ పై సిబ్బందికి అవగాహన సమావేశమును డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెండర్లు కోరడం జరిగిందని, వ్యాపారస్తులు, సిబ్బందికి టెండర్లపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈనెల 17వ తేదీ పుట్టపర్తిలో జిల్లా ప్రజా రవాణా అధికార కార్యాలయము నందు మధ్యాహ్నం రెండు గంటల లోపు జరుగునని తెలిపారు. హిందువులకు సంబంధించిన టెండర్ ఫారములు ఈ నెల నాలుగవ తేదీ నుండి 16వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు డిపో మేనేజర్ ధర్మవరం వారి కార్యాలయంలో ఆఫీసు పని దినములలో టెండర్ ఫారములు రూ.885 అమ్మబడునని తెలిపారు. ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ అధికారులు సిబ్బంది ఈ టెండర్లపై తమ సహాయ, సహకారాలు కూడా అందించాలని తెలిపారు.