విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ మండలం నందు శుక్రవారం ధర్మవరం వ్యవసాయ సహాయ సంచాలకులు కృష్ణయ్య ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనికి చేశారు. స్థానిక మన గ్రోమెూర్ కేంద్రం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, రాజేశ్వరి ట్రేడర్స్, మరియు శివ సాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణాల యందు ఎరువుల నిల్వలు మరియు రికార్డులు తనిఖీ చేశారు. ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శంకర నాయక్ , విస్తరణాధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు.