విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఈదుమూడి గ్రామంలో నిర్వహించిన వసుదకు వందనంలో ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డ్వామా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్థూపం వద్ద ఎంపీపీ నలమలపు అంజమ్మ, ఎంపీడీవో జయమణి, వైసీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి నలమలపు కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు సెల్ఫీ దిగారు. గ్రామంలో మొక్కలు నాటారు. అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మట్టిగుంట గ్రామంలో జరిగిన వసుధకు వందనం కార్యక్రమంలో విశ్రాంత జవాన్ గోరంట్ల శ్రీనివాసరావును ఎంపీపీ దంపతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువాతో సత్కరించారు. అమరవీరుల త్యాగాలను మరువరాదని సూచించారు. కార్యక్రమంలో లిడ్ క్యాప్ రాష్ట్ర డైరెక్టర్ కంచర్ల సుధాకర్, ఈదుముూడి సర్పంచ్ బోలే లక్ష్మి, మట్టిగుంట సర్పంచ్ పాలేరు అనిలాకుమారి, బోలె ఆంజనేయులు, పాలేరు నాగేశ్వరరావు, అగ్రహారం ఎంపీటీసీ పొదా పవన్, పోలినేని కోటేశ్వరరావు ,ఏపీఓ రవిబాబు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.