దేశంలో మళ్లీ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. గతంలో ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసినా కరోనా.. ఇప్పుడు కొత్తవేరియంట్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా మళ్లీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగనే మోగాయి. ఈ కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో కేసులు నెల రోజుల్లో 52 శాతం పెరిగాయి. అంటే కరోనా కేసులు విజృంభణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల 5 వేలకుపైగా మందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనాతో లక్ష 18వేల మంది ఆస్పత్రిపాలైయ్యారు. అటు నెల రోజుల వ్యవధిలో 3 వేల మందికిపైగా జనాలు కరోనా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1తో వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మళ్లీ విజృంభిస్తుంది. ఇక దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు, ఒకరు మృతి చెందినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. కేరళ, కర్నాటక, తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. దేశంలో 3,742 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, తెలుగురాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 38 యాక్టివ్ కేసులు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 18కి చేరాయి.