వైకాపా మండల అధ్యక్షుడు రవి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలలో ఆశావహులు పెరగడం పైరవీలు చేయడం సహజమని అటువంటి వాటిని నమ్మి ఆందోళనకు గురి కావద్దని వైకాపా మండల అద్యక్షుడు మోరి రవి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలలోనే గాక మిగిలిన అన్ని రాజకీయ పార్టీలలోనూ ఆశావహుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో తమ పార్టీలోనూ టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చన్నారు. అంత మాత్రాన కొత్త వారికి చోటు కల్పిస్తారని జరుగుతున్న ఊహాగానాలలో వాస్తవం లేదన్నారు. పనితనం, ప్రజాభిమానమే కొలమానంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరూ టిక్కెట్ ఆశించడంలో తప్పు లేదన్నారు. కానీ పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి, మన్య ప్రాంతా అభివృద్ధికి నిరంతరం శ్రమించిన వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. పాడేరు నియోజకవర్గంలో గడపగడపకు సంక్షేమాన్ని అందించడమే గాక, మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాలలోనూ అలుపెరుగక పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామంలోనూ చేసి చూపిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి వైకాపాలో మరో మారు పార్టీ టిక్కెట్టు రావడం ఖాయమని, అదే క్రమంలో ఈ గతం కంటే అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఇందులో పార్టీ శ్రేణులు ఎటువంటి ఊహాగానాలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. గిరిజనులపై, ముఖ్యంగా ఎమ్మెల్యే భాగ్యమ్మ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమితమైన నమ్మకం ఉందని, ఆ దిశలోనే పాడేరు నియోజకవర్గ చింతపల్లి మండల కేంద్రంలో మునుపెన్నడు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి పర్యటించిన దాఖలాలు లేవన్నారు. అటువంటిది భాగ్యమ్మ పై ఉన్న నమ్మకంతో జగనన్న ముఖ్యమంత్రి హోదాలో చింతపల్లి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రాకను ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలకు దిగడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రాకను రానున్న రోజుల్లో మన్య ప్రాంతా అభివృద్ధికి శుభ సూచికంగా తాము భావిస్తున్నామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగ్యలక్ష్మి టిక్కెట్టు తెచ్చుకోవడం గాక బంపర్ మెజార్టీతో అసెంబ్లీలో మరో మారు మన్యప్రాంత గొంతుకను వినిపిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.