విశాలాంధ్ర,కదిరి.ఆర్టీసీ ఉద్యోగులుగా మా కష్టాలు తీర్చాలంటూ నిరసన వ్యక్తం చేశారు.మంగళవారం పిలుపు మేరకు తమ సమస్యలు పరిస్కారం చూపాలని డిపో పని చేస్తున్న 471 మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వములోకి విలీనం కాకమునుపు కేంద్ర కార్మిక చట్టాల మేరకు అనేక సంక్షేమపథకాలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించేవని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.వి.రమణ తెలిపారు. కాని ప్రభుత్వం లోకి విలీనం అయిన తదుపరి అనేక సమస్యలు ఆర్టీసీ ఉద్యోగులు ఎద్కుర్కొంటున్నారని తెలిపారు.ఉద్యోగులపైన అథికారుల కక్షసాధింపు,సెలవులు ఇవ్వకపోవడము, ఉద్యోగ భద్రత సర్క్యులర్ అమలు చేయక పోవడము, క్యాడర్ స్త్రెంత్ తో ఇబ్బందులు, ఇ.పి.ఎస్ ఆఫ్షన్ పైన ఇబ్బందులు, ఆరోగ్య విధానం, బదిలీలు, ఆర్థిక సమస్యలు, పదోన్నతులు, గ్యారేజి ఉద్యోగుల సమస్యలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈసమస్యలకు ఆర్టీసీ యజమాన్యం స్పందించకున్నచో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులుతెలిపారు. ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షుడు హరిమోహన్, కార్యదర్శి బైరిశెట్టి, అధ్యక్షుడు రామక్రిష్ణ, ప్రభాకర్ రెడ్డి, గంగన్న,పులి శ్రీనివాసులు, అయూబ్, అశ్వర్థమయ్య తదితరులు పాల్గోన్నారు.