విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) మండల పరిధిలోని గో ట్లురు గ్రామంలో గల ఆంజనేయస్వామి దేవాలయంలో నాలుగున్నర లక్షల రూపాయలతో ఓ గదిని నిర్మించి, తన భక్తి భావాన్ని చాటుకున్నారు ధర్మవరంలోని భం భం హోటల్ అధినేత పార్వతి శంకర్. కీర్తిశేషులు పార్వతీ వెంకటస్వామి, భార్య కీర్తిశేషులు పార్వతి వెంకటరమణమ్మ, కుమారుడు పార్వతీశంకర్ కోడలు కీర్తిశేషులు పార్వతి శంకర్, పార్వతి ఆనందమ్మ, కీర్తిశేషులు గుండ్లపల్లి ఈశ్వరయ్య భార్య గుండ్లపల్లి నారాయణమ్మల జాపకార్థం ఈ గదిని కట్టించడం జరిగిందని దాతలు తెలిపారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ దైవాజ్ఞ లేనిదే ప్రపంచములో ఏది కూడా విజయవంతం కాదని, ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకుంటే, చక్కటి మనశ్శాంతితో కూడిన జీవితం లభిస్తుందన్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు దాతల పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి, ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.